దేవరపల్లి కొండగూడెం విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో జరిగిన ప్రమాదం లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు చెందిన ఒకొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటిందని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం కంపెనీ వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాథమిక విచారణ లో తెలియ వచ్చిందని, పూర్తి స్థాయి విచారణ కు ఆదేశించడం జరిగిందని కలెక్టర్ అన్నారు
ఈ ప్రమాదం కారణంగా దుంగ మహిదర్, ఎంగాల రత్నబాబు, సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు చెందిన చదువుకున్న వ్యక్తికి ఒకరికి కంపెనీ లో ఉద్యోగం, అంతిమ సంస్కరాలు కోసం తక్షణ ఆర్థిక సహాయం గా కంపెనీ తరపున ఒక్కొక్కరికి రూ. 2.50 లక్షలు ఆర్థిక సహాయం అందజేసినట్టు పేర్కొన్నారు.