టిడిపి తీరు మారకపోతే కాంగ్రెస్ గదే పడుతుంది..


Ens Balu
3
మద్దెలపాలెం
2020-09-22 21:04:14

విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం పట్ల విశాఖ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని..కాని రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుశకుని లా  తయా రయ్యారని వైఎస్ఆర్ సీపీ నగర శాఖ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్దెలపాలెం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరిగిన అభివృద్ధి అంతా గతంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహనరెడ్డి  చేస్తున్నారన్నారని అన్నారు. అలాంటి  ప్రభుత్వ పథకాలను కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుని చంద్రబాబు  అడ్డుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న వంశీ రాష్ట్ర అభివృద్ధి చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారుని ఆరోపించారు. పేద ప్రజలకు  అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్నారు. ఆ పాపం చంద్రబాబుకే తగులుతుంద న్నారు.  ఇలానే  వ్యవహరిస్తే రానున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు  పట్టిన గతే తెలుగుదేశానికి పడుతుందన్నారు జోస్యం చెప్పారు.