ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేది ఆఖరు


Ens Balu
18
Srikakulam
2022-12-06 11:04:00

ఓటరు తిరస్కరణకు గల కారణాలను అప్లోడ్ చేసి ఓటరుకు తెలియజేయాలని ఓటరు నమోదుపరిశీలకులు ఎ.బాబు తెలిపారు.  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి  ఓటరు నమోదు అధికారులుసహాయ ఓటరు నమోదు అధికారులువివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ అధికారులను బూత్ స్థాయి అధికారులుపోలింగ్ కేంద్రాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులువిఆర్ఓలు మంచి సామర్థ్యం గల యువత ఉన్నారనిఅలాంటి వారిని వినియోగించుకొని శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అర్హత గల వారని నమోదు చేయడంఅనర్హత గల వారిని తొలగించడం వంటి ప్రోసెస్ గూర్చి తెలియజేయాలన్నారు. మండలాల వారీగా సచివాలయాల సిబ్బంది ఎంత మంది ఉన్నదీ తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.


డూప్లికేట్లను తొలగించడంఇంట్లో కూర్చుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. డూప్లికేట్ అంటే డబుల్ ఎంట్రీవయసు తక్కువ ఉండటం వంటి వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటరు నమోదుతొలగింపు వంటి వాటిపై సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తనకు తెలియజేయాలని 9441412121,

ababu@ias.nic.in చెప్పారు.   బూత్ స్థాయి అధికారులు అర్హతగల  ఓటరు నమోదు కొరకు ఇంటింటికీ ప్రచారం నిర్వహించాలనిఫారం 1 నుంచి 8 వరకు ఫారాలు దగ్గరే ఉంచుకోవాలన్నారు.   ఒకే వ్యక్తి ఫొటోతో రెండు  లేదా అంతకంటే ఎక్కువ ఓటరు నమోదు జరిగినట్లయిటే అటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి  ఓటరు అంగీకారంతో ఒకటి ఉంచి మిగతా వాటిని రద్దు చేయాలన్నారు. 


బూత్ స్థాయి నుండే ఓటర్లు నమోదు గూర్చి తహసీల్దార్లుబూత్ స్థాయి అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. 18-19 వయసు వారిపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.  ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెటీరియల్ ను వినియోగించు కోవాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుఓటరు జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తులు పెట్టుకోవాలని తెలపాలన్నారు.  ఓటరు నమోదు పై గ్రామ సచివాలయాల ద్వారా తెలియజేయాలని పరిశీలకులు సూచించారు. బిఎల్ఓ స్థాయిలో సమావేశాలు జరగాలనిమండల స్థాయిలో సహాయ ఓటరు నమోదు అధికారులు ఓటరు నమోదుపై సమీక్షలు జరగాలన్నారు. చేర్పులుమార్పులుతొలగింపులకు గలు కారణాలు తెలిపేది అప్ లోడ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు కింద స్థాయి అధికారులే ప్రభుత్వానికి స్తంబాల్లాంటి వారని కొనియాడారు. ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేదీ ఆఖరనిఅర్హత గల ఓటర్లనుఓటర్లుగా నమోదు చేయించుకోవాలని చెప్పారు.


         జిల్లా కలెక్టర్జిల్లా ఓటరు నమోదు అధికారి శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు గూర్చి తెలియజేసిజిల్లా నుండి పాలకొండరాజాం నియోజకవర్గాలు పార్వతీపురం మన్యంవిజయనగరం జిల్లాల్లో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో ఓటర్లు నమోదుమైగ్రేషన్ ఓటర్లుకొత్తగా నమోదు అవుతున్న ఓటర్లుతదితర వాటి గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటరు నమోదు పరిశీలకులకు వివరించారు. గ్రామాల్లో టంటం వేయించి తెలియజేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు నమోదుపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ఇటీవల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 18-19 వయసు గల వారి నుండి 20 వేల దరఖాస్తులను ఓటరు నమోదుకు స్వీకరించినట్లు వివరించారు. 


     టిడిపి ఉపాధ్యక్షులు పిఎంజె బాబు మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదు కార్యక్రమల్లో పాల్గొంటున్నారని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధారాలు అందజేస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలగింపులువలసలుతదితర సమస్యలుపై మాట్లాడారు. ప్రతీ తొలగింపునకు కారణాలను అప్లోడ్ చేయాలని పరిశీలకులు ఎ. బాబు ఆదేశించారు.   సిపిఎం పార్టీ నుండి కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో 18-19 వయసు గల యువత ఉన్నారని ఓటర్లు నమోదుకు విఆర్ఓను పంపాలని కోరారు. ఓటరు నమోదుపై వాలంటీర్లు పాత్ర గూర్చి తెలపగా ఏ బూత్ లో ఉన్నారో ఆధారాలు అందజేస్తే సంబంధిత విఆర్ఓపై తక్షణ చర్యలు  తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బిజెపి నుండి రవి బాబ్జీ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కు ఇంత వరకు ఎవరూ రాలేదని చెప్పగా పోలింగ్ స్టేషన్ల వారీగా పార్టీలకు సంబంధించి జాబితా రాజకీయ పార్టీల ప్రతినిధుల జాబితూ అందజేస్తే ఆ జాబితాలను బిఎల్ఓలకు అందజేస్తామని కలెక్టర్ వివరించారు. బిజెపి నుండి బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బిఎల్ఎబిఎల్ఓలకు వర్క్ షాప్ నిర్వహించాలని కోరారు.


వైయస్ఆర్ సిపి రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదుపై అవగాహన పరుస్తున్నారని తప్ప ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన లేదని చెప్పగా ఓటరు నమోదు పై వాలంటీర్లు ఏ విధమైన పాత్ర ఉండకూడదని ఓటరు నమోదు పరిశీలకులు ఎ. బాబు చెప్పారు.

     ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డిఓటరు నమోదు అధికారులు ఎ. రాజేశ్వరిజి. జయదేవిసీతారామమూర్తిబి. శాంతివెంకటరామన్,  ఎ.ఇ.ఆర్.ఓ లువివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజె బాబుసిపిఐ పార్టీ నుండి బాబ్జీవై.యస్ఆర్ సిపి నుండి రామకృష్ణబిజెపి నుండి ఉమామహేశ్వరరావురవి బాబ్జీతదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు