దీన్ దయాల్ సేవలు మిజోరాంకు అందించాలి...


Ens Balu
13
Visakhapatnam
2022-12-13 13:12:13

దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ సేవలు మిజోరం, ఒరిస్సా ప్రాంతాల్లో విస్తృతం చేయాలని తన సహాయ సహకారాలు అందిస్తానని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు  అన్నారు. దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినికిడి లోపం ఉన్న నిరుపేదలకు 200 మందికి ఉచితంగా వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించింది.  మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిజోరం గవర్నర్  మాట్లాడుతూ దీన్ దయాల్ శ్రవణా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేగుల రామాంజనేయులు చేస్తున్న సేవలు హర్షణీయం అన్నారు.  ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో  15 మేజర్ క్యాంపులు పెట్టి 8200 మందికి ఉచితంగా వినికిడి మిషన్లు ఇవ్వడం అనేది చాలా ఆనందమైన విషయం. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి ఈ నాలుగు జిల్లాలని పైలెట్ ప్రాజెక్టుగా స్వీకరించి ఎల్కేజీ టు పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఐడెంటిఫికేషన్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు అందించాలని ఫౌండేషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి తమ వంతు సహకారం సహకారం అందిస్తామన్నారు. 


 దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్  వ్యవస్థాపకులు రామాంజనేయులు  మాట్లాడుతూ ప్రతి ఏడాది నిరుపేద వినికిడిలోపం ఉన్న బాధితులకు గుర్తించి వారికి సరిపడే పరికరాలు అందిస్తామన్నారు.  భారతదేశంలో వినికిడి లోపం నిర్మూలన చేయడమే తమ సంస్థ కర్తవ్యం అన్నారు. 2034 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వినికిడి సమస్య లేని రాష్ట్రంగా చేయాలనే లక్ష్యం ఉందన్నారు.  ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచారకులు పి జనార్ధన్, ఎన్ ఎఫ్ ఎల్ డైరెక్టర్  తోట సర్వారాయుడు, మాట్లాడుతూ దీన్ ద ఫౌండేషన్ కి ఎన్ ఎఫ్ ఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఫౌండేషన్ కి 10 లక్షల రూపాయలు వినికిడి మిషన్ల కొరకు ఇస్తున్నామన్నారు.  ఈ యొక్క కార్యక్రమము ఎన్ఎఫ్ఎల్ ద్వారా చేస్తున్నామన్నారు .  ఓఎన్జిసి ఇండిపెండెంట్ డైరెక్టర్  అజిత్ కుమార్ రాజు, ఫార్మర్ వైస్ చాన్సులర్ ఆంధ్ర యూనివర్సిటీ జి నాగేశ్వరావు, వెస్ట్రన్ కోల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అగర్వాల్, మీదాని ఇండిపెండెంట్ డైరెక్టర్ వి చక్రపాణి,  బిజెపి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్రారెడ్డి,  షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్  కే ఎన్ పి చక్రవర్తి , మిదాని ఇండిపెండెంట్ డైరెక్టర్ వి చక్రపాణి ,  బిజెపి సీనియర్ నాయకులు చెరువు రాంకోటయ్య  ,  ఫార్మా కౌన్సిల్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొని దాదాపు 200 మందికి ఉచిత వినికిడి మిషన్లో పంపిణీ చేశారు.