తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకి అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఎం.కుమార్ రెడ్డి టిటిడి బుధవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టిటిడి పరిపాలన భవనంలో జేఈఓ వీరబ్రహ్మంకు ఈ మేరకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ప్రతీ భక్తుడికి పూర్తిస్థాయిలో చేరాలన్నదే తమ కోరికని..తిరుమలకు వచ్చిన ప్రతీ భక్తుడూ..స్వామివారి అన్నప్రసాదం సీకరించాలని, తరిగొండ వెంగమాంబను స్పూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.