రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న భూ శాశ్వతహక్కు భూరక్ష రీసర్వే పారదర్శకంగా చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీ సర్వే సరిహద్దురాల్లు ఏర్పాటు గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ ముసాయిదా ఆర్ఓఆర్ ఫైనల్ ఆర్వార్ ,13 నోటిఫికేషన్ ఓ ఆర్ ఐ మ్యాపులతో సంబంధం లేకుండా సర్వేనిర్వహణ ముటేషన్లు పరిష్కారం, 22 ఏ ప్రకారం సర్వేలో దేవాదాయ గ్రామకంఠ భూములు తొలగింపు, నాలాపై వచ్చిన దరఖాస్తులు పరిష్కారం సర్వేలో ఉత్పన్నమైన ఫిర్యాదులు పరిష్కారం తదితర అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించి నిర్దేశిత లక్ష్యాలు ఏ మేరకు చేరుకున్నది అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని. వైఎస్సార్ జగనన్న భూ శాశ్వత హక్కు, భూరక్ష పథకం పేరిట సమగ్ర భూ సర్వేను ఆచరణ లోకి తెచ్చిం దని జిల్లా కలెక్టర్ తెలిపారు
దశల వారీగా సర్వే చేపట్టి భూ సమస్య లను పరిష్కరిస్తూ వివాదరహిత భూములను భావితరాలకు అందించేందుకు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయని వందేళ్ల క్రితం సర్వే వివరాలతో రూపొందించిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఇప్పటికీ అమలు చేస్తున్నారని. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్వహిం చిన సర్వే ఆధారంగా భూ సంబంధిత లావాదేవీలు కొనసాగిస్తున్నా రని. ఒకే సర్వే నెంబర్లు పై పలుమార్లు లావాదేవీలు జరిగాయని. వార సులు భాగపంపిణీలు చేసుకోవడం. బహుమతిగా ఇవ్వడం, క్రయ విక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా సబ్ డివిజన్ భూమి మీద జరగక పోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా రీసర్వేను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారన్నారు.
గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లోనమోదు చేయడం వంటి పనులు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు గ్రౌండ్ వాల్యుయేషన్ గ్రౌండ్ త్రుతింగ్ సరిహద్దు రాళ్ల ఏర్పాటు తోపాటు, సర్వేలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా 22 గ్రామాలలో ఓ ఆర్ ఐ మ్యాపులు లేకుండా సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 గ్రామాలకు హక్కుపత్రాలు పంపిణీ కొరకు సిద్ధం చేయడం జరిగిందన్నారు గ్రౌండ్ ట్రుతింగ్ గ్రౌండ్ వాల్యుయేషన్ . ప్రక్రియలు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు హక్కుపత్రాల పంపిణీ ప్రక్రియ త్వరలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ద్యాన చంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు,సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ,కార్యాలయ సెక్షన్ అధికారులు రమణకుమారి,పి సుబ్రహ్మణ్యం,తదితరులు పాల్గొన్నారు.