విజయనగరంలో స్పందనకు 133 వినతులు


Ens Balu
15
Vizianagaram
2022-12-26 12:49:33

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 136 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 72 ఉన్నాయి. పింఛన్ల కోసం, రేషన్ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర  సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్,  డి.ఆర్.ఓ గణపతి రావు,  ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, దొర పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.