ఉపాది హామీ పథకం లక్ష్యాలు అధిగమించాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-09-23 19:02:21
విశాఖ జిల్లాలో ఉపాధి హామీ పథకం లో చేపట్టిన భవన నిర్మాణాలు రాబోయే మార్చి నెలలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. బుధవా రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అమలుపై ఎస్ ఇ లు , ఇ ఇ లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నఈ పనులను ఎలాంటి జాప్యం లేకుండా చేయాలని తెలిపారు. మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు చేయడం, భవనాల నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యాలకు అనుగుణంగా జరగాలని తెలిపారు. అంగన్ వాడీలు, రైతు భరోసా కేంద్రాలు , సచివాలయాలు , విలేజ్ హెల్త్ క్లినిక్ లు , కాంపాండ్ వాల్స్ నిర్మాణాల పనులన్నీ తప్పని సరిగా శనివారం లోగా ప్రారంభించాలని తెలిపారు. ఇంజనీర్లు వారికి కేటాయించిన హెడ్ క్వార్టరు లో నివాసం ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు. కొంత మంది ఇంజనీర్లు లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమౌతున్నారని , వారి పని తీరు మెరుగుపర్చుకోకపోతే పరిపాలనా చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతిరోజు టెలి కాన్పరెన్స్ ద్వారా సమీక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్ ఇ సుధాకర రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఇ రవికుమార్, ఎస్ ఎస్ ఎ పిడి మల్లికార్జునరెడ్డి, హౌసింగ్ పిడి జయరామ్ చారీ, డ్వామా పిడి సంధీప్, గిరిజన సంక్షేమ ఇ ఇ లు , ఇతర అధికారులు పాల్గొన్నారు.