విశాఖలో 4వ రోజు 74% హాజరు..
Ens Balu
1
విశాఖజిల్లా
2020-09-23 19:07:33
విశాఖ జిల్లాలో సచివాలయాల్లో నియామకాలకు బుధవారం రాత పరీక్షలకు 74 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఈరోజు పరీక్షలకు 5883 మంది హాజరు కావలసి వుండగా 3477 మంది హాజరుకాగా, 1304 మంది హాజరు కాలేదు. ఉదయం పరీక్షలకు 1186 మందికి 936 మంది (79 శాతం) హాజరవగా 250 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 3697 మందికి 2541 మంది (69శాతం) హాజరవగా 1,154 మంది హాజరు కాలేదు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులలో కోవిడ్ వచ్చిన వారు ఎవరు లేరు. స్ర్కైబ్ లో ఉదయం ముగ్గురు, మధ్యాహ్నం ఇద్దరు పరీక్షలు వ్రాసారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు. పరీక్షా కేంద్రం వద్ద మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బంది, వికాలంగులకు ప్రత్యేక వీల్ చైర్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ప్రతీఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన తరువాత అభ్యర్ధులను లోనికి అనుమతిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.