కాకినాడ ఎస్పీ రవీంధ్రనాధ్ బాబుని కలిసిన ఈఎన్ఎస్ చీఫ్


Ens Balu
21
Kakinada
2022-12-30 12:10:00

కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబును ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చీఫ్ అండ్ సీఎండీ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో ఈఎన్ఎస్ నెట్వర్క్ విస్తరణ, ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net కార్యక్రమాలు, త్వరలో ప్రారంభించ బోయే దిన పత్రికకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో ఈఎన్ఎస్ మీడియా నెట్వర్క్ ను విస్తరించడం అభినందనీయమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈఎన్ఎస్ మీడియా ద్వారా మంచి సమాచారాన్ని అందించి  అసత్యప్రచారాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకి తీసుకెళ్లడానికి ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా, అన్నవరం ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు