ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ డిమాండ్ చేసారు. ఏపీ రాష్ట్రంలో 50వేల 677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలో మీడియాకి ప్రకటనల విడుదల చేశారు. డీయస్సీ విషయంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పిన వైసీపీ నేతలు,ప్రస్తుతం తాము అధికారంలో కి వచ్చిన 3సంవత్సరాల 6 నెలలు తర్వాత కూడా డీయస్సీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేక పోయారని మాధవ్ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోవడం వలన విద్యా నాణ్యత తగ్గుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కాలండర్ ను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఎద్దేవా చేసారు. రోజు రోజుకు నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల నమ్మకం పోతోందని పేర్కొన్నారు. అన్ని శాఖలలో ఖాళీ పోస్టులు ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.