మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా సేవలందించాలి


Ens Balu
21
Vizianagaram
2023-01-01 17:49:39

విజయనగరం జిల్లాలో మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా విఎఫ్ఏలు, మత్స్యశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో సేవలు అందించాలని ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతూ, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా జిల్లాని మత్స్యశాఖ పరంగా ముందుంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందించడంతోపాటు, ప్రభుత్వ లక్ష్యాలను కూడా సకాలంలో అదిగమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ చాందిని, కార్యాలయ సిబ్బంది, విఎఫ్ఏలు పాల్గొన్నారు.