ఆదర్శ సచివాలయాల నిర్మాణమే లక్ష్యం..
Ens Balu
1
Kothapeta
2020-09-23 20:00:09
విజయనగరం జిల్లాలో ఆదర్శవంతమైన సచివాలయ వ్యవస్థ రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. హరిజవహర్లాల్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కొత్తపేటలో ఉన్న వార్డు సచివాలయం ను సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యద ర్శులు,వాలంటీ ర్లును ఉద్దేశించి మాట్లాడారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున విధులు కేటాయించిడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు శతశాతం అందాల్సిందేనని అన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సులభతరం అయినప్పటికీ పేర్లు నమోదు, తొలగింపు లో ఎందుకు జాప్యం కలుగుతుందని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి లబ్దిదారునికి అమ్మ ఒడి పథకం అందే విధంగా చూడాలన్నారు. వైయస్సార్ బీమా పథకం వల్ల నిరుపేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న విషయం గ్రహించాలని, మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించే బాధ్యత కార్యదర్శుల దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ,సహాయ కమిషనర్ ప్రసాదరావు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.