విద్యార్ధలకు విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు


Ens Balu
17
Tirupati
2023-01-05 06:45:59

తిరుపతి నగరంలోని విద్యార్థినీ, విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అచ్యుతాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో ని అన్నమాచార్య కళామందిరంలో ఈ పోటీలు జరుగుతాయి.  పదేళ్ళ లోపు విద్యార్థినీ, విద్యార్థుల కు ''అచ్యు తాష్టకం" పై నిర్వహిస్తారు. 10 నుంచి 15 ఏళ్ళ లోపు వయసు గల విద్యార్థినీ, విద్యార్థులకు  "విష్ణు సహస్ర నామ స్తోత్రం" మీద పోటీలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో హాజరై పేర్లు నమోదు చేయించుకోవాలి. విజేతలకు అదే రోజు అక్క డే బహుమతులు ప్రదానం చేస్తారు. మరిన్ని వివరాలకు 9676615643 మొబైల్ నంబర్ లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.