ఏసిబికి చిక్కిన అవినీతి చేప..


Ens Balu
3
గురుగుబిల్లి
2020-09-23 20:38:19

గ్రామసచివాలయంలో ఉద్యోగం వచ్చి ఇంకా ఏడాది పూర్తికాలేదు..అపుడే లంచావతారం..విసిగి వేశారిన బాధితులు ఎలాగైనా ఏసీబి పట్టించాలని పక్కాగా ప్లాన్ వేసి మరీ ఆ లంచావతారాన్ని రెడ్ హేండెడ్ గా దొరికేలా చేశారు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా, గురుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వర్రావు పట్టాదారు పాసు పుస్తకాలకు 5వేలు లంచం డిమాండ్ చేశాడు. 80 సెంట్ల భూమికి పాసు పుస్తకాలు సబ్ డివిజన్ చేసి ఇవ్వాలంటే తక్షణమే ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విషయాన్ని నేరుగా రైతు ఏసిబికి తెలియజేశాడు. రైతు ఐదువేలు ఇవ్వగానే ఏసిబి అధికారులు వీఆర్వోని పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్టు అధికారులు ప్రకటించారు. గతంలో కూడా ఇద్దరు ముగ్గురి దగ్గర లంచాలు వసూలు చేసిన చరిత్ర ఉండటంతో, లంచాల ఇబ్బందులు భరించలేక ఏసిబిని ఆశ్రయించారు.