భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, 2023 టిటిడి క్యాలెండర్, డైరీని ఈఓ అందజేశారు.