ఏయూలో జయహో జనగణమన ప్రోమో ఆవిష్కరణ


Ens Balu
12
Visakhapatnam
2023-01-23 13:23:41

స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తున్న జయహో జనగణమన వారోత్సవాలు ప్రోమోను ఏయూ విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. జనగణమన గీతారాపన ప్రతి భారతీయుడి భాద్యత అన్నారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ గ్రౌండ్స్ లో ఏయూ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సంయుక్త భాగస్వామ్యంతో జనగణమన శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేసారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, ఏయూ సైకాలజీ పరిశోధక విద్యార్థి గంట్ల శ్రీనుబాబు  పాల్గొన్నారు.