లోకేష్ పాదయాత్ర.. టిడిపికి పాడేయాత్ర


Ens Balu
17
Visakhapatnam
2023-01-24 14:02:52

లోకేశ్‌ పాదయాత్ర టీడీపీకి  పాడెయాత్ర  కావడం త్వరలోనే ఖాయం అయిపోతుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి జోస్యం చెప్పారు. మంగళవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్రకు వైఎస్సార్‌సీపీ భయపడుతోందని టీడీపీ నేతలు అనిత, బోండా, అయ్యన్న లు ప్రగల్భాలు పకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకే మా పార్టీ భయపడలేదు. లోకేశ్‌ పాదయాత్రకు మాకో లెక్కా అంటూ తీసి పడేశారు. అయినా టిడిపీ ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తుందని ఆమె ప్రశ్నించారు. యువగళం కాస్త ప్రజలకు గరళంగా మారుతుందనే విషయంలో పాదయాత్రలో తేలిపోతుందన్నారు.