గణతంత్ర దినోత్సవంలో ఆకర్షించిన మత్స్యశాఖ శకటం


Ens Balu
32
Vizianagaram
2023-01-26 13:55:04

విజయనగరంజిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 74వ గణతంత్ర వేడుకల్లో మత్స్యశాఖ శకటనం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధానమంత్రి  మంత్స సంపద యోజన పథకంలో మత్స్యకారులకు మంజూరు చేసిన ఆటోను నేరుగా వేడుకలో ప్రదర్శనకు ఏర్పాటుచేశారు జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి. తానే స్వయంగా శకటానికి మత్స్యకారులు, గ్రామీణ మత్స్య సహాయకులతో కలిసి, మువ్వన్నెల జెండా పట్టుకొని ముందుకి నడిచారు. ఆ సమయంలో జిల్లా మత్స్యశాఖ ద్వారా ఇటీవల చేపట్టిన ప్రగతిని, చేపట్టబోయే కార్యక్రమాలను వెనుక నుంచి చక్కగా చదివి వినిపించారు.