మిసెస్ ఇండియా పోటీలకు పైడి రజని


Ens Balu
9
Visakhapatnam
2023-01-27 09:10:48

రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరుగునున్న మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు పైడి రజని హాజరుకానున్నారు. గత ఏడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెల్చుకున్న ఈమె రాజస్థాన్లో జరుగుతున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా పోటీలకు ఫైనలిస్ట్ గా ఎంపికయ్యారు. ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నాలుగు రోజులు పాటు జరుగనున్న పోటీల్లో వివిధ కేటగిరీల్లో ఎంపిక కావాల్సి ఉంటుందన్నారు. శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణ పై నాలుగు రోజులు పాటు జరుగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ ఆల్ ఇండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో నాలుగు రోజులు పాటు వివిధ కేటగిరీల్లో ఎంపికైన మేరకు కేటగిరీల వారీగా టైటిల్స్ అందజేస్తారని అమె తెలిపారు.
సిఫార్సు