అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అన్నవరానకి చెందిన పెమ్మరాజు, గుజరాత్ కి చెందిన వెంకటేశ్వర్రావులు వెండి పూజపాత్రలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో వాటిని సిబ్బందికి అందజేశారు. ఒక వెండి ప్లేటు, పంచపాత్, మట్టుగిన్నె, ఉద్దరిణిలు కలిపి సుమారు 969 గ్రాముల వెండి వస్తులు స్వామివారికి సమర్పించినట్టు ఆలయ వర్గాలు తెలియజేశాయి. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థాన సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.