స్పర్శ, కుష్టు వ్యాధి పై ప్రచారం చేయాలి


Ens Balu
13
Anakapalle
2023-01-27 14:31:14

జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13 వరకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలను తెలియజేయాలన్నారు. ఏ విధంగా వ్యాపించే అవకాశం ఉన్నదో తెలియజేయాలని వ్యాధి సోకిన తర్వాత ఎలా గుర్తించాలి లక్షణాలు కనిపించడానికి ఎంత సమయం పట్టవచ్చు అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  ఈ విషయమై విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎ హేమంత్, అదనపు డిఎం అండ్ హెచ్ ఓ బి శారదాబాయి డి ఎల్ డి వో మంజులవాని బీపీఎమ్ఓ డాక్టర్ సి కిషోర్ కుమార్ బీహెచ్ఈవో ఆఫ్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు