పౌష్టికాహారంతో తల్లి, బిడ్డ ఆరోగ్యం పదిలం..


Ens Balu
3
Rajavommangi
2020-09-24 20:24:50

గర్బిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని సూపర్ వైజర్ మంగ సూచించారు. రాజవొమ్మంగి మండలం దూసరపాము సెక్టార్ శరభవరం గ్రామ అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవం   జరిగింది. ఈ సందర్భంగా బి.పి.ఏ. సత్తిబాబు మాట్లాడుతూ, మహిళ గర్భం దాల్చి ప్రసవించిన రెండు సంవత్సరాల వరకూ సక్రమంగా కోవిడ్ నియమాలు పాటిస్తూ,పోషకాహారాలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు తక్కువ ఖర్చు తో కూడిన ఎక్కువ పోషక విలువలు గల తృణధాన్యాలు తీసుకోవాలని సూపర్వైజర్ మంగ సూచించారు. అంగన్వాడీ వద్ద అందించే అనుబంధ పోషకాహారాన్ని  లబ్దిదారులందరూ వినియోగించుకోవాలని, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి నియమాలు పాటించాలో అంగన్వాడీ వర్కిర్ ఏ. రత్నకుమారి తల్లులకు అవగాహన కల్పించారు.  అంగన్వాడీ వర్కర్ జె. సత్యవతి, గ్రామ పోలీస్ టి.భూలక్ష్మి,స్థానిక ఎమ్.ఎల్.హెచ్.పి  ఏ.దివ్యజ్యోతి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.