రెండు గంటలు ఆలస్యంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్
Ens Balu
22
Visakhapatnam
2023-02-16 16:59:24
విశాఖనుంచి బయలు దేరే వందేభారత్ రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుందని విశాఖ రైల్వే అధికారులు ప్రకటించారు. ఇటీవల జరిగిన గోదావరి ఎక్స్ ప్రెస్ ఘటన కారణంగా పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయని..అందులో భాగంగానే శుక్రవారం విశాఖపట్నం నుండి ఉదయం 5.45గంటలకి బయలుదేరవలసిన వందే భారత్ రెండు గంటలు ఆలస్యంగా 7.45కి విశాఖపట్నం నుండి బయలుదేరుతుందని రైల్వే అధికారులు వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించుకోవాలని తెలియజేశారు.