లీగల్ ఎయిడ్ డిఫెన్స్ పై అవగాహన ఉండాలి
Ens Balu
10
Rajamahendravaram
2023-02-17 14:36:41
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ విధానం ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు/ముద్దాయిలకు అందిస్తున్న న్యాయ సేవల గురించి సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి వివరించారు. శుక్రవారం ఆమె రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్న వసతులను ఆమె పరిశీలించారు. ఖైదీల కోస ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను వివరించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ, ముద్దాయికి అవసరమైన ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఉచిత న్యాయ సహాయం పొందడం వారి హక్కు అని తెలియజేశారు. ఖైదీలకు, ముద్దాయి లకు అందచేస్తున్న వైద్య సేవలు గురించి కారాగారం నందు పని చేస్తున్న వైద్యులతో మాట్లాడారు. అక్కడున్న వైద్య సదుపాయాలు, ఖైదీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వసతులు, సదుపాయాల విషయంలో ఏ విధమైన అవసరాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకు రావాలని వారికి సూచించారు. ఈ సందర్భం గా జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు, జైల్ అధికారులు, మెడికల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.