కెకె లైన్ లో పట్టాలు తప్పిన గూడ్సు రైలు
Ens Balu
6
Araku Valley
2023-02-17 14:57:56
కిరండోల్ నుండి విశాఖకు వచ్చే గూడ్స్ రైలు ఒడిస్సాలోని సుక్కు కొరపుట్ మద్య శుక్రవారం పట్టాలు తప్పిందని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ అనుప్ తెలియజేశారు. ఉదయం కిరండోల్ నుండి విశాఖకు బయలుదేరి వెళ్తున్న గూడ్స్ రైలుకు ఒడిస్సాలోని సుక్కు కొరపుట్ మద్య రైల్ ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. గూడ్స్ రైలులో ఉన్న 8బోగిలు పట్టాలు తప్పయని వివరించారు. ఈ కారణంగా విశాఖ నుంచి కిరండోల్ కు మద్యాహ్నం వెళ్ళు ప్రత్యేక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేశామన్నారు. పట్టాలు తప్పిన రైలు పునరుద్ధరణ జరిగిన తర్వాతే కిరండల్ వరకు ప్రత్యేక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు పై ప్రకటన చేయనున్నట్టు ఆయన వివరించారు. విశాఖ-కిరండోల్ లైనులో ప్రయాణాలు చేసేవారు ఈ అంతరాయాన్ని గమనించాలని ఆయన కోరారు.