కోరాపుట్-విశాఖపట్నం సెక్షన్ పరిశీలంచిన డీఆర్ఎం


Ens Balu
24
Visakhapatnam
2023-02-18 13:09:15

విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ అనుప్ సత్పతి విశాఖపట్నం-కోరాపుట్ సెక్షన్‌ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్లలో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలు, ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అంతేకాకుండా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు అధికారులతో కలిసి సుక్కు-కోరాపుట్ మధ్య రైలు పట్టాలు తప్పిన స్థలాన్ని  ఆయన పరిశీలించారు. అనంతరం వెయిటింగ్ హాల్స్ ,ప్లాట్‌ఫారమ్‌ల వద్ద ప్రయాణీకులతో సంభాషించారు. సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రధాన సమస్యలను వీలైనంత వరకు పరిశీలించి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని చెప్పారు. ఆయన వెంట ఎడిఆర్‌ఎం సుధీర్ కుమార్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పి కె మహారాణా, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ జి. సునీల్ కుమార్, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్ భాటి, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్  ఎస్ కె పాత్ర తదితరులు ఉన్నారు.