విజయనగరంలో వచ్చే ఏడాదినుంచి మెడికల్ కాలేజీ
Ens Balu
13
Vizianagaram
2023-02-21 09:32:15
విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. దీనితో కళాశాల ఏర్పాటు తోపాటు వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు లభిస్తున్న వేళ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వెళ్లే ఇబ్బందులు తప్పే అవకాశముంది.