నామినేషన్ కి బలవంతంగా జనాలను తరలిస్తున్నారు


Ens Balu
23
Visakhapatnam
2023-02-21 15:29:54

వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు రేపు నామినేషన్ వేస్తున్న సందర్భంగా జన సమీకరణ చేయమని వార్డు వాలంటీర్లంపై వత్తిడి తెస్తున్నారని మా దృష్టికి వచ్చిందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అన్నారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రతి వాలంటీరు కనీసం ఐదుగురిని తీసుకు రావాలని చెప్పినట్లు తెలిసిందని ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. గతంలో ది . వాలంటీర్ల ద్వారానే అర్హత లేని వారికి కూడా ఓట్లు నమోదు చేయించారని ఇపుడు మళ్లీ అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నిబంధనలు ఉల్లగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండవలసిన వాలంటీర్ల వ్యవస్థ అధికార పార్టీ జేబు సంస్థగా మారకుండా చూడాలని కోరుతున్నామని అన్నారు.