అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కళారంగంలో మార్చి7న ప్రోత్సాహక పోటీలను నిర్వహిస్తున్నట్లు విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు పేర్కొన్నారు. గురువాం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన ఓంశాంతి ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గీతాలాపన రంగవల్లులు విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. పాటల పోటీలు ఎంట్రీలను మహిళా ప్రభుత్వ కళాశాల టీచర్ నంబర్ డాక్టర్ కె వి.వేణి ఫోన్ నంబర్ 939 3114901... రంగవల్లులు ఎంట్రీ లకు సంబంధించి విజేఎఫ్ కార్యవర్గ సభ్యురాలు పి. వరలక్ష్మీ నంబర్ 9059308958 లలో సంప్ర దించాలి ఆని కోరారు. ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటలులోగా పంపాలన్నారు. గీతాలాపన పోటీలో 10 నుంచి 15 సంవత్సరాలు లోపు వారిని జూనియర్స్ గాను పదహారేళ్లు పైబడిన వారిని సీనియర్స్ గానూ పరిగణిస్తామన్నారు. ఈ కార్య క్రమంలో విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.