విశాఖలో వచ్చే నెల 16వ తేదిన నిర్వహించబోయే ఎం .ఎల్.సి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఎం.ఎల్.సి. ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ను ఎం.ఎల్.సి. ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్ట్రాంగ్ రూమ్ లను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసారు. అదే విదంగా రిసెప్సన్ కౌంటర్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో చేపడుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు హుసేన్ సాహేబ్, భాస్కర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీతమ్మ ధార్ తాహసిల్దార్ శ్యామ్ ప్రసాద్, జి.వి.ఎం.సి సిబ్బందిపాల్గొన్నారు.