జి-20 సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి


Ens Balu
14
Visakhapatnam
2023-02-26 14:50:43

విశాఖలో మార్చి మూడు, నాలుగు తేదీలలో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడి వాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజ న తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, 25 దేశాల నుంచి పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతు న్నా రని, ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు 7,500 మంది ఇప్పటివరకు రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు. వీరందరికీ తగిన ఏర్పాటు చేసేందు కు చర్యలు తీసుకుంటున్నామని అని చెప్పారు. రాష్ట్రంలోని ఉన్న వనరులు, సరళీకృత ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామికవేత్తల కు వివరించడంతో పాటు, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ఆయన చెప్పారు. ఈ స మ్మిట్ ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.