ప్రెస్ అకాడమీ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగం..


Ens Balu
2
Visakhapatnam
2020-09-26 13:36:02

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహించే శిక్షణా తరగతులు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం జూమ్ ద్వారా నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పాల్గొని శిక్షణా కార్యక్రమాలపై తన అభిప్రాయాలను ప్రెస్ అకాడమీకి చైర్మన్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఇలాంటి తరగతులు మరెన్నో నిర్వహించడం ద్వారా చాలా మంది జర్నలిస్టులకు ఉపయోగకరంగా వుంటాయన్న ఆయన ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విశాఖజిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 180 మంది జర్నలిస్టులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. అదేవిధంగా మరిన్ని అంశాలపై కూలంకుశంగా శిక్షణ ఇవ్వడం ద్వారా జర్నలిస్టులు రాబోయే రోజుల్లో పరిణితి చెందడానికి అవకాశం వుంటుందని పేర్కొన్నారు. ఈయనతోపాటు విశాఖనుంచి పలువురు జర్నలిస్టులు ఈ జూమ్ ఒక్కరోజు శిక్షణా తరగతిలో పాల్గొన్నారు.