పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ గా ఈరోజు మేరీ గ్రేస్ కుమారి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఫోక్సో కోర్టు న్యాయ మూర్తిగా విశేష సేవలు అందించి, పదవి విరమణ చేసిన మేరీ గ్రేస్ కుమారిని తిరిగి శాశ్వత లోక్ అదాలత్ చైర్ పర్సన్ గా నియమించడం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాధులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. మేరీ గ్రేస్ ఆధ్వర్యంలో శాశ్వత లోక్ అదాలత్ పశ్చిమగోదావరి జిల్లాలో చక్కటి సేవలు అందజేస్తుందని న్యాయవాదులు గుంటూరు బాబు గణేష్, గుంటూరు చంద్రమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ చీఫ్ మునీశ్వరరావు, డిప్యూటీ చీఫ్ కౌన్సిల్ రామ్మోహన్ రావు, అసిస్టెంట్ కౌన్సిల్ టి మధు లు తదితరులు పాల్గొన్నారు.