లాక్ డౌన్ పాక్షికంగా సడలింపు..
Ens Balu
4
Srikakulam
2020-09-26 18:34:55
శ్రీకాకుళం లో ఆదివారం పాలిసెట్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పట్టణంలో లాక్ డౌన్ పాక్షికంగా సడలింపు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె నివాస్ శనివారం మీడియాకి తెలియజేశారు. శ్రీకాకుళం పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆదివారం రోజున కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పోటీ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా అధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అభ్యర్థులకు ఆహార పానీయాలు, పరీక్షలకు సంబంధించిన పరికరాలు అవసరమయ్యే అవకాశం ఉందని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా లాక్ డౌన్ కు సడలింపు ఇచ్చామన్నారు. అభ్యర్థులు దేనికి ఇబ్బందులకు గురి కారాదని ప్రశాంతంగా పరీక్షలు రాసి సంతోషంగా వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. పాక్షికంగా సడలింపు ఇచ్చినప్పటికీ చేపలు, మాంసాహారానికి సంబంధించిన దుకాణాలు, మార్కెట్లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. హోటళ్లు, ఇతర దుకాణాలు అనుమతించటం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.