డైట్ పరీక్షలు వాయిదా..
Ens Balu
2
Srikakulam
2020-09-26 18:46:55
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నుండి జరగవలసిన డైట్ పరీక్షలు వాయిదాపడినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ శనివారం తెలిపారు. ఈ సంద ర్భంగా డిఈఓ మీడియాతో మాట్లాడుతూ, 2018-20 సంవత్సరం వారికి గతంలో పరీక్ష వ్రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులకు ప్రధమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 28 నుండి అక్టోబర్ 5 వరకు జరగవలసి ఉందన్నారు. కరోనా నేపధ్యంలో పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని వివరించారు. పరీక్షలు మళ్ళీ ఎప్పుడు జరిగేది తెలియజేయడం జరుగుతుందని చెప్పిన ఆమె ఈ విషయాన్నిఅభ్యర్ధులు గమనించాలన్నారు. ఈలోగా అభ్యర్ధులు పరీక్షలకు మరింతగా సన్నద్ధం అయ్యేలా తయారు కావాలని ఆమె కోరారు.