బీజేపీ మాధవ్ కి ఓట్లు పడకపోవడం వెనుక స్టీల్ ప్లాంట్


Ens Balu
51
Visakhapatnam
2023-03-17 01:46:26

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి మాదవ్ కి ఓట్లు రాకపోవడం వెనుక స్టీల్ ప్రైవేటీకరణ అంశం గట్టిగా ప్రభావం చూపింది. కలిసి వస్తాయనుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఓట్లన్నీ టిడిపి అభ్యర్ధికి, అధికార పార్టీ అభ్యర్ధులకే వెళ్లిపోతున్నాయి. మొదటి రౌండ్ నుంచి మూడవ రౌండ్ పూర్తయ్యేవరకూ బిజేపీ 4వ స్థానానికే పరిమితం అయ్యింది. విశాఖ సెంటిమెంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఎవరికైనా గట్టి గుణపాఠం చెబుతామన్న ఉద్యోగులు ఆ పంతాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చేసి చూపారన్న మాట రుజువైపోయింది. అందులోనూ కేంద్రం ఇచ్చిన విశాఖ రైల్వే జోన్, విభజన ఆంధ్రప్రదేశ్ హామీలు అమలు చేయకపోవడం, ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయడంతో ఉద్యోగులే కాకుండా నిరుద్యోగులు కూడా బిజేపీపై తమ నిరసనను ఓటు రూపంలో చూపించారు. ఇపుడు పడ్డ ఓట్లన్నీ పార్టీ కేడర్ ఓట్లే అంటున్నారు విశ్లేషకులు.
సిఫార్సు