సెలవంటూ వెళ్లిపోయిన YSRCPఅభ్యర్ధి సుధాకర్


Ens Balu
14
Visakhapatnam
2023-03-17 05:25:19

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందుతానని ముందగానే పసిగట్టిన అధికారపార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి సీతం రాజు సుధాకర్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. 16వ తేది రాత్రి నుంచి ప్రారంభమైన పోలింగ్ కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి టిడిపి అభ్యర్ధి డా.వేపాడ చిరంజీవిరావు ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. అభ్యర్ధి గెలుపుని నిర్ధేశించేది మూడు రౌండ్ల ఫలితాలే నని తేలడంతో 5వ రౌండ్ వరకూ వేసి చూసిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి అందులోనూ టిడిపీకే మెజార్టీ రావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేక వెనుతిరిగారు. రాత్రి నుంచి ఎలాంటి కౌంటింగ్ పాసులు లేకపోయినా హడావిడి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి ఒక్కొక్కరుగా సీతంరాజు వెంట నడవాల్సి వచ్చింది. ఎన్నికల ముందురోజు వరకూ నలుగురు అభ్యర్ధుల మధ్య పోటీ వుంటుందని భావించా.. ఎన్నిక అయినరోజు మాత్రం అసలైన పోటీ ముగ్గురు మద్యే ఉంటుందని తేలిపోయింది..అయినా విజయం దక్కలేదు..!
సిఫార్సు