కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలి..
Ens Balu
3
కోటిదిబ్బ
2020-09-26 19:27:36
కష్టంలో వున్నవారిని ఆదుకోవడం దేవునికి సేవ చేయడంతో సమానమని జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) నంబూరి తేజ్ భరత్ చెప్పారు. స్దానికి కోటిదిబ్బలోని విభిన్న ప్రతిభావంతుల ప్రభుత్వబాలికల వసతిగృహం ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన విభిన్నప్రతిభావంతులకు వివిధ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జెసి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 264 మంది విభిన్నప్రతిభావంతులైన లబ్దిదారులు 45.54 లక్షలు విలువచేసే ఉపకరణాలు అందచేశారు. బ్యాటరీతో నడిచే ట్రైసెకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ కిట్స్, స్క్రీన్ రీడింగ్ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు వంటి వివిధ రకాల 479 ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యతసంతరించుకున్న కార్యక్రమమన్నారు. ఎవరైతే వారి తప్పులేకుండా విభిన్నప్రతిభావంతులుగా జన్మించారో వారిని అన్ని విధాలా ఆదుకోవడం, వారికి సహాయం చేయడం అనేది దేవునికి సేవచేయడమేనని అన్నారు. అలింకో సం స్థ తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు వారికి అవసరమైన ఉపకరణాలు అందించడం చాలా అభినందనీయమన్నారు. విభిన్నప్రతిభావంతులు ఒక ప్రదేశం నుండి వేరొకచోటుకి వెళ్లడానికి, వారిదైనందిన కార్యక్రమాలు, పనులు నిర్వహించుకునేందుకు ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉసకరణాలు పొందిన లబ్దిదారులు వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. కోవిడ్ సమయంలో వివిధ ప్రాంతాల నుండి తగుజాగ్రత్తలతో ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా వుందన్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్ పట్ల అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మూడు విషయాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ తోగాని సబ్బుతోకాని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, అలాగే బహిరంగ ప్రదేశాలకు, మార్కెట్లకు, షాపులకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. ఇవి పాటిస్తే కోవిడ్ బారినపడకుండా మనం రక్షణ పొందవచ్చునని నంబూరి తేజ్ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్ డిఒ కుమారి పనబాక రచన, ఎపి,తెలంగాణా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎస్ .ఎస్ ప్రసాద్, అలింకో మేనేజర్ రాజేష్, బధితుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్ది, విభిన్నప్రతిభావంతుల సంక్షేమశాఖ రిటైర్ద్ సహాయ సంచాలకులు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.