సచివాలయా నిర్మాణాలు పూర్తిచేయాలి..
Ens Balu
3
మెరకముడిదాం
2020-09-26 19:54:06
విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణం పురోగతిని తెలుసుకొనే నిమిత్తం జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు శనివారం మెరకముడిదాం మండలంలో డ్వామా పి.డి. నాగేశ్వరరావుతో కలసి పర్యటించారు. చినబంటుపల్లిలో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయం భవనాన్ని పరిశీలించారు. సోమలింగాపురంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్ర భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఉత్తరావల్లిలోనూ గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను పరిశీలించి పంచాయతీరాజ్ ఇంజనీర్లతో వాటిని ఎప్పుడు పూర్తిచేసేది అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరులోగా జిల్లాలో చేపట్టిన భవనాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాల్సి వుందని, ఎటువంటి జాప్యానికి తావులేకుండా త్వరగా నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు.