విశాఖ సాగరతీరంలో జి20 పతాకం విహంగ వీక్షణం


Ens Balu
29
Visakhapatnam
2023-03-26 06:07:02

విశాఖలో నిర్వహించే జి20 సదస్సుల పతాకాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలీకాఫ్టర్ ద్వారా వినూత్నంగా నగరవాసులకు తెలియజేశారు. ఆర్కే బీచ్ నుంచి నగరంలో సదస్సు లు జరిగే ప్రాంతాలు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ప్రదేశాల్లో ఈ హెలీకాఫ్టర్ అత్యంత క్రింది నుంచి వెళ్లి నగరవాసులకు కనువిందు చేసింది. హెలీకాఫ్టర్ కి కట్టిన జి20 పతాకం, విశేషంగా ఆకట్టుకుంటోంది. జి20 సదస్సులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అన్ని విషయాలను విశేషంగానే  ప్రజలకు తెలియజేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.