అల్లూరి జిల్లాలో ఏప్రిల్ 1న ఉచిత వైద్యశిబిరం


Ens Balu
8
Paderu
2023-03-29 08:03:43

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో  ఏప్రిల్ ఒకటవ తేదిన విశాఖపట్నం గాయత్రీ విద్యాపరిషత్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ హల్త్ కేర్ అండ్ మెడి కల్ టెక్నోలజీస్  ఆద్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. పాడేరు కలక్టరేట్ ఆవరణలో జరుగు ఈ ఉచిత వైద్యశిభిరాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గాయత్రీ వైద్య కళాశాలలోని ప్రముఖ వైద్యులు పాల్గొంటారని, బిపి, షుగర్, ఇ.సి.జి, కంటి పరీక్షలు వంటి  వైద్య పరిక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు.