సింహాచలం అప్పన్న ఉత్సవాలకు కి ఆహ్వానం


Ens Balu
8
Visakhapatnam
2023-03-29 13:30:22

సింహాచలం అప్పన్న సన్నిధిలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలకు దేవస్థానం అధికారులు, పండితులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వ రూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం పీఠానికి వెళ్ళి ఆహ్వాన పత్రికను అందజే సారు. అప్పన్న సన్నిధిలో ఏటా నిర్వహించే చందనోత్సవం, తిరు కళ్యాణోత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వచ్చాయి. ఏప్రిల్ 2వ తేదీన తిరు కళ్యాణోత్సవం, 23వ తేదీన చందన మహోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరు కావల్సిందిగా పీఠాధిపతులను సింహాచ లం దేవస్థానం ఇన్ ఛార్జ్ ఈఓ త్రినాధ్, పండితులు కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని, వేసవికాలం అ యినందున ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్వరూపానందేంద్ర స్వామి అధికారులకు సూచించారు.