సీఎంను మళ్లీ ఆశీర్వదించండి–ఎమ్మెల్యే కురసాల


Ens Balu
20
Kakinada
2023-03-29 15:15:30

ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ నగరంలోని రూరల్‌ నియోజవర్గ పరిధిలోని డివిజన్లలోని లబ్ధిదారులతో వైఎస్సార్‌ ఆసరా 3వ విడత సంబరాలతో ఆయన పాల్గొన్నారు. 3వ డివిజన్‌ గుడారిగుంట మూడు గుళ్ళ సెంటరు లో ఈ కార్యక్రమం నిర్వహించారు.కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర అధ్యక్షు రాలు సుంకర శివప్రసాన్నసాగర్,మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమీషనర్‌ నాగనరసింహరావు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఆసరా రుణమాఫీ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 8 అర్బన్‌ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు రూ.3.20 కోట్ల చెక్కును లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా మహిళలు, మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి పాలాభిషేకం చేశారు.

 ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఆసరా పథకం కింద రూ.120కోట్లు రుణమాఫీ అవుతున్నాయ న్నారు. మూడో విడతగా రూ.40కోట్లు మాఫీ అయ్యాయన్నారు. చెప్పాండంటే చేస్తారని ముఖ్యమంత్రి జగనన్నపై ప్రజల్లో ముఖ్యంగా అక్క చెల్లె మ్మల్లో ఉందని ఆ విధంగా ఆయన ఆసరా పథకం అమలు చేస్తూన్నారన్నారు. ఆయన హామీ ఇస్తే శాసనంగా అమలు చేస్తున్నారన్నారు. దేశం లో ఆదర్శవంతంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారన్నారు. కార్యాక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కుర సాల సత్యనారాయణ, మాజీ కార్పొరేటరు వడ్డి మణికుమార్,  ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ నారాయణరావు, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రీజనల్‌ కో ఆర్డినేటరు జమ్మలమడక నాగమణి, కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మాజీ కార్పొరేటరు శైలజ, వడ్డీ మణికుమార్  వైఎస్సార్‌ సీపీ నాయకులు, అధికారులు, నేరేళ్ళు, జగన్నాధం, రాజారపు కృష్ణ, వాసిరెడ్డి సూరిబాబు, కృప పాల్గొన్నారు.