వ్యవ‌సాయ మార్కెటింగ్ క‌మిష‌న‌ర్ 31న జిల్లాలో ప‌ర్యట‌న‌


Ens Balu
16
Vizianagaram
2023-03-30 06:47:57

రాష్ట్ర వ్యవ‌సాయ మార్కెటింగ్ శాఖ క‌మిష‌న‌ర్‌, మార్క్ ఫెడ్ ఎం.డి. రాహుల్ పాండే శుక్రవారం జిల్లాలో ప‌ర్యటించ‌నున్నట్టు ఆ శాఖ స‌హాయ సంచాల‌కులు వై వి శ్యాంకుమార్ తెలిపారు. త‌న ప‌ర్యట‌న‌లో భాగంగా జిల్లాలో ప‌లు మార్కెట్ యార్డులు, రైతుభ‌రోసా కేంద్రాలు, రైతుబ‌ జార్‌ల‌ను క‌మిష‌న‌ర్ సంద‌ర్శిస్తార‌ని, జిల్లా కేంద్రంలో వ్యవ‌సాయ మార్కెటింగ్ శాఖ కార్యక‌లాపాల‌పై స‌మీక్షిస్తార‌ని పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ రాహుల్ పాండే తొలుత విజ‌య‌న‌గ‌రం మార్కెట్ యార్డును సంద‌ర్శించి అనంత‌రం అక్కడే జిల్లాలో మార్కెటింగ్ శాఖ కార్యక్రమాల‌పై స‌మీక్ష నిర్వహిస్తార‌ని తెలిపారు. అనంత‌రం ఆర్ అండ్ బి రైతుబజార్‌ను సంద‌ర్శిస్తార‌ని, నెల్లిమ‌ర్ల మండ‌లం గుషిణిలోని ఎం.పి.ఎఫ్‌.సి. గోడౌన్‌ను సంద‌ర్శిస్తార‌ని పేర్కొన్నారు. భోగాపురంలోని వేబ్రిడ్జిని, పూస‌పాటిరేగ మండలం కొప్పెర్లలో రైతుభ‌రోసా కేంద్రాన్ని సంద‌ర్శించి అనంత‌రం విశాఖ వెళ‌తార‌ని పేర్కొన్నారు.