హైటెక్ విధానంలో వాహనాల లెక్కింపు సులభతరం


Ens Balu
2
2023-03-31 08:01:34


జాతీయ రహదారిపై వార్షిక వాహనాల లెక్కింపు సులభతరమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాహనాల లెక్కింపు చేపడుతున్నారు.  అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఈ సర్వే నిర్వహి స్తున్నారు. గతంలో రోడ్లపై మనుషులు ఉండి ఎన్ని వాహనాలు వెళుతున్నాయి, వస్తున్నాయనేది  రాసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పో యింది. జాతీయ రహదారిపై రెండు వైర్లు అమర్చి వాటికి సీసీ కెమెరా ఏర్పాటుచేసి అటుగా వెళ్లే వాహనాలు సంఖ్యతో పాటు వాటి వివరాలు పూర్తిగా నమోదయ్యేలా అధునాత విధానాలను ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాకుండా  వాహనాల బరువుని కూడా నమోదు చేస్తున్నారు. ద్విచ క్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు వంటి వాటిని లెక్కింపు స్పష్టంగా వెల్లడవుతుంది. ఈ వాహనాల రాకపోకల సర్వే ప్రకా రం రోడ్లు పటిష్ఠ పర్చడం, విస్తరించడం వంటివన్నీ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతుంది.