అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలన..


Ens Balu
4
Simhachalam
2023-04-05 09:40:27

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై బుధవారం జిల్లా  అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ,నగర పోలీస్ కమిషనర్  సిహెచ్ శ్రీకాంత్, .జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్, డీసీపీలు సునీల్ సుమిత్. ఆనంద్ రెడ్డి.. ఇతర పోలీసు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సింహాచలం ఈవో వి త్రినాధరావు తో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. తొలుత వీరంతా కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని  క్యూలైన్ల మార్గాలు,, భక్తులు వాహనాలు పార్కింగ్ ఇతర సదుపాయాలు కోసం ఉత్సవ మాస్టర్ ప్లాన్ ను నిషితముగా పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఉచిత దర్శనం 300, 1000, 1500 క్యూ లైన్లు ఏ విధంగా వేగంగా ముందుకు సాగుతాయని  ఈఓ త్రినాధ్ రావు ను, ఈఈ ను అడిగి తెలుసుకున్నారు. 

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు వీరికి వివిధ క్యూలైన్లు చూపించారు. గత ఏడాది ఏర్పాటుచేసిన క్యూలైన్ లకు ఈ ఏడాది ఏర్పాటుచేసిన వాటికి వ్యత్యాసం అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు వేగవంతంగా  సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని దేవస్ధానం అధికారులు కి కలక్టర్ సూచించారు. భక్తులు ఎక్కువసేపు వేచి చూడకుండా వేగవంతంగా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా చూడాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణం తో పాటు వివిధ మార్గాల రూట్లను పరిశీలించారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీ , ప్రోటోకాల్  ప్రముఖులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి ను దర్శించుకోవాలని  అందుకు తగ్గ ఏర్పాట్లు చేద్దామని అధికారులు చర్చించారు.అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ సంయుక్తంగా ఏఏ మార్గాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాసేపు మాట్లాడుకున్నారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత ఏడాది నిజరూప దర్శనం ఉత్సవం పూర్తి స్థాయి లో విజయవంతం  ఐయ్యిందన్నరు.

 ఉత్సవం ప్రారంభ దశలో వర్షం కురవడము వల్ల కొద్ది పాటి   ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నది కలక్టర్ కు తెలియజేశారు. ఐతే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారము తో చందనోత్సవం విజయవంతం చేద్దామని కలక్టర్ మల్లికార్జున అన్నారు..  అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి లో పక్కాగా చేసుకోవాలి అన్నారు. ఆనంతరం వీరు సింహాద్రి నాథుడు ను దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు వీరి పేరిట నిర్వహించారు.ఆలయ ఈఓ త్రినాధ్ రావు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు దినేష్ రాజ్, సంపంగి శ్రీను, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.