అప్రజాస్వామిక విజెఎఫ్ పాలకవర్గంపై కలెక్టర్ కి ఫిర్యాదు


Ens Balu
21
Visakhapatnam
2023-04-17 16:30:30

ఒకటి కాదు 2కాదు ఏకంగా 12ఏళ్లు తగదునమ్మా అంటూ కోర్టు కేసుల నెపంతో విజెఎఫ్ ను ఏలినక పాలక వర్గం అప్రజాస్వామికంగా(Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)ను తుంగలోకి తొక్కిన వైనం పై సీనియర్ జర్నలిస్టు బంటయ్య ఆధ్వర్యంలో సోమవారం స్పందనలో జర్నలి స్టులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుచేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకేసులు ఉన్నాయని గానీ, నిధుల ఖర్చుపై గానీ ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా వారి పదవీకాలం అయిపోయినప్పటికీ విజెఎఫ్ ను వీడకుండా కనీసం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా విజెఎఫ్ పరువు తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో విజెఎ ఫ్ పై విచారణ చేయాలంటూ జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున జిల్లా రిజిస్ట్రార్ మూర్తిని ఆదేశించారు. అసలు విజెఎఫ్ ఏనిబంధనను ఉల్లంఘించిందనే విషయమై లిఖితపూర్వ కంగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.