మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వాసుపల్లి..
Ens Balu
5
Seethammadara
2020-09-27 12:51:23
రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం మంత్రి నివాసంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి మంత్రితో ముచ్చటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటకాభివ్రుద్ధిని ఏ ప్రభుత్వంలో లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివ్రుద్ధి చేసేందుకు మంత్రి ముత్తంశెట్టి ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. అదీకాకుండా విశాఖజిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి మరీ అభివ్రుద్ధిచేయడం అనేది ఎంతో కాలం నుంచి నలుగుతున్న అంశమని, అలాంటి మంచి కార్యక్రమం మంత్రి ముత్తంశెట్టి హయాంలో జరగడం నిజంగా శుభపరిణామమన్నారు. కొత్త పర్యాటక ప్రాంతాల గుర్తింపు ద్వారా విశాఖనగరంతోపాటు, జిల్లా కూడా అభివ్రద్ధి చెందడంతోపాటు, చాలా మందికి ఆయా కొత్త పర్యాటక ప్రాంతాల వద్ద ఉపాది కూడా లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో చరిత్రగల విశాఖజిల్లా మరింతగా పర్యాటకంగా ముందుకు సాగితే ప్రపంచ పర్యాటకుల చూపు విశాఖవైపు పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు..