సీఎం వైఎస్ జగన్ కు ఘనంగా వీడ్కోలు


Ens Balu
17
Visakhapatnam
2023-04-19 14:35:25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి  శ్రీకాకుళం జిల్లాలో  జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం బుధవారం మ ధ్యాహ్నం 2.20గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి,  పార్లమెంట్ సభ్యులు బి.సత్యవతి, జి.మాధవి, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర , విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జిల్లా కలెక్టర్ డా . ఎ . మల్లికార్జున ,  పోలీస్ కమిషనర్ డా. సి.యం త్రివిక్రమ్ వర్మ , జీవీఎంసీ కమీషనర్ సి.యం సాయికాంత్ వర్మ , ఎపిఈపిడిసియల్ సియండి ఐ. పృధ్వి తేజ్ , శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  తదితరులు ముఖ్యమంత్రి కి ఘనంగా వీడ్కో లు పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో 2.30ని.లకు విజయవాడ బయలుదేరి వెళ్లారు.